రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్ కు జాక్ పాట్

VijayaBhaskar · March 25, 2026
Spread the love

భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం

రాజ‌స్థాన్ : భారతీయ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ రాయ‌ల్స్. సంస్థ య‌జ‌మాని మ‌నోజ్ బ‌దాలేకు పంట పండింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న జాక్ పాట్ కొట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌టా రెండా ఏకంగా రూ. 15 వేల కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది. త‌ను 2008లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును రూ. 320 కోట్లకు కొనుగోలు చేశారు.
గత సంవత్సరం, ఆయన రాజస్థాన్ రాయల్స్ 100% వాటాలను అమ్మడానికి బిడ్లను ఆహ్వానించారు.

కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (CPCP) సహ-వ్యవస్థాపకులైన నిషా సచ్‌దేవా , దేబ్‌జీత్ గుప్తా, RR కోసం $1.7 బిలియన్ల బిడ్ వేశారు.రాబ్ వాల్టన్ , హాంప్ కుటుంబం మద్దతు ఉన్న కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోసం $1.63 బిలియన్ల బిడ్ వేసింది. ఇదిలా ఉండ‌గా మనోజ్ బదాలే CPCP బిడ్‌ను తిరస్కరించి, ఫ్రాంచైజీని కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియమ్‌కు అమ్మారు. వాల్టన్, హాంప్ కుటుంబాలు NFLలో డెన్వర్ బ్రాంకోస్ , డెట్రాయిట్ లయన్స్ వంటి జట్లకు యజమానులు.వాల్టన్‌లు 2022లో బ్రాంకోస్‌ను $4.5 బిలియన్లకు కొనుగోలు చేశారు. హాంప్‌లు 1963లో లయన్స్‌ను $4.5 మిలియన్లకు కొనుగోలు చేశారు .