సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

కీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వ సహకారం, పరిపాలనా సామర్థ్యాల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా, ప్రభుత్వ శాఖలకు సింగపూర్ లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శిక్షణ ఇవ్వనున్న‌ట్లు తెలిపారు మంత్రి ప‌య్యావుల కేశవ్.

ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంద‌ని సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌కు తెలియ చేశారు. పాల‌నా ప‌రంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు మంత్రి. ఇందులో భాగంగా మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా మార్పులు చేయ‌డం జ‌రిగంద‌న్నారు. దీని వ‌ల్ల పారిద‌ర్శ‌క‌త పెరిగింద‌ని, సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా, అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప‌రంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు నిరంత‌రం శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *