సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

Spread the love

వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క మార్పులు తీసుకు వ‌స్తాం

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంది కూట‌మి స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు సింగ‌పూర్ ప్ర‌తినిధ‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు విజ‌య‌వాడ కేంద్రంలోని త‌న కార్యాల‌యం నుంచి. సింగపూర్ లో అమలు చేస్తున్న ఆధునిక తీర అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ పై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆహార ఉత్పత్తుల నిల్వ, నాణ్యత పరిరక్షణ, నష్టాలను తగ్గించే విధానాలు, ఆధునిక కోల్డ్ చైన్ వ్యవస్థలపై ఇరు పక్షాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు ఇచ్చుకున్నారు.

ఈ రంగంలో సాంకేతిక సహకారం పెంపుపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారం, జ్ఞాన మార్పిడి, పెట్టుబడుల అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ విధానాలు, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ చర్చలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆఫిషియో, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    Spread the love

    Spread the loveకీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను…

    ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

    Spread the love

    Spread the loveప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శాంత్ కిషోర్ ఫైర్ బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీపై తీవ్ర‌స్థాయిలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *