కేరళ సర్కార్ పై భగ్గుమన్న వైనం
కేరళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. వీరంతా శాసన సభ సమావేశాలలో హాజరు కావాల్సి ఉండగా వారంతా గంప గుత్తగా ఇప్పుడు కేరళ ఎన్నికల్లో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. దేశంలో గత 12 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కులం పేరుతో, మతం పేరుతో ప్రజలను విడదీసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు జాగ్రత్తగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించు కోవాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.





