రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

కేర‌ళ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైనం

కేర‌ళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌స్తుతం శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ముఖ్య‌మైన నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్నారు. వీరంతా శాస‌న స‌భ స‌మావేశాల‌లో హాజ‌రు కావాల్సి ఉండ‌గా వారంతా గంప గుత్త‌గా ఇప్పుడు కేర‌ళ ఎన్నిక‌ల్లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. దేశంలో గ‌త 12 ఏళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కులం పేరుతో, మ‌తం పేరుతో ప్ర‌జ‌ల‌ను విడ‌దీసి ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా త‌మ విలువైన ఓటు హ‌క్కును వినియోగించు కోవాల‌ని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *