ఆర్డీటీ సేవ‌ల‌కు ఇక ఆటంకాలు ఉండ‌వు

స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ

అనంత‌పురం జిల్లా : సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మైన ఆర్డీటీ సంస్థను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేసిన నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో ఆర్.డి.టి. ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచ్ ఫెర్రర్ ని, ఆర్.డి.టి. మహిళా సాధికారత అధ్యక్షులు విష ఫెర్రర్ ని ఎడిసిసి బ్యాంకు చైర్మన్ కేశవ రెడ్డి , పుట్లూరు మండల కన్వీనర్ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు శ్రీధర్ బాబు ,జిసి బాబు , రమణ క్యాటరింగ్స్ యజమాని కొప్పల వెంకటరమణ తో కలిసి మర్యాద పూర్వకంగా క‌లిశారు.

ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు బండారు శ్రావ‌ణి శ్రీ‌.
ఆర్డిటి సంస్థ సేవలు కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే మహనీయుడు, దివంగ‌త‌ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాల బాటలో నడుస్తున్న మంచ్ ఫెర్రరీకి నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాని పేర్కొన్నారు. ఎంతో వెనకబడి ఉన్న అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ చేపట్టిన కార్యక్రమాలు సేవలు చాలా అమోఘమైనవి అని ప్ర‌శంసించారు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ లకు విద్య, ఆర్థిక అభివృద్ధిలో అందించిన సేవలు గొప్పవన్నారు. అలాగే కుల మతాలకు సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆర్డిటి ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందజేయడం పట్ల జిల్లా వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *