దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

Spread the love

సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే.

తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు.

వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ విశాల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ఉద్యమం ఉమ్మడి 13 జిల్లాలు, 100 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సుమారు 1000 కిలోమీటర్ల మేర తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సాగుతున్న ఈ యాత్రలో పాల్గొన్న సైకిల్ యాత్రికులు శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకోగా డీఎస్పీ నరసింహ మూర్తి, వన్ టౌన్ సీఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి ఘన స్వాగతం అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, యాత్రికులతో కలిసి కొంత దూరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును బలంగా నిర్మించండి, డ్రగ్స్‌ను వదిలేయండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆహ్వానించండి వంటి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

  • Related Posts

    సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

    Spread the love

    Spread the loveసోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు.…

    మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

    Spread the love

    Spread the loveఆవిష్క‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *