దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే.

తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు.

వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ విశాల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ఉద్యమం ఉమ్మడి 13 జిల్లాలు, 100 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సుమారు 1000 కిలోమీటర్ల మేర తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సాగుతున్న ఈ యాత్రలో పాల్గొన్న సైకిల్ యాత్రికులు శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకోగా డీఎస్పీ నరసింహ మూర్తి, వన్ టౌన్ సీఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి ఘన స్వాగతం అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, యాత్రికులతో కలిసి కొంత దూరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును బలంగా నిర్మించండి, డ్రగ్స్‌ను వదిలేయండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆహ్వానించండి వంటి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *