newsseals.com
News

పెట్టుబ‌డుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి

VijayaBhaskar April 8, 2026
newsseals-NaraLokesh
Spread the love

స్ప‌ష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చాయ‌న్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల గ్రౌండింగ్ పై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ఆల‌స్యం అయితే దానికి గ‌ల కార‌ణాల‌ను, సమస్యలను గుర్తించాలని అన్నారు. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం అని పేర్కొన్నారు నారా లోకేష్‌. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం అని చెప్పారు.

ఈడీబీని మరింత బలోపేతం చేస్తాం అని ప్ర‌క‌టించారు మంత్రి. ప్రతి శాఖ ఈడీబీ ట్రాకర్ ను పర్యవేక్షించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను నామినేట్ చేయాలని ఆదేశించారు నారా లోకేష్‌. ఎంఎస్ఎంఈ పార్క్ లు, టెక్స్ టైల్ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకింగ్ అంశాలపైనా సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.