రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ

Spread the love

అమ‌రావ‌తి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్

న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. సోమ‌వారం ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజ‌ధానిగా అమ‌రావ‌తి బిల్లుపై సంత‌కం చేసినందుకు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంత‌కు ముందు ముర్మును ఘ‌నంగా స‌న్మానించారు నారా లోకేష్. మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి చెంద‌ని పార్ల‌మెంట్ స‌భ్యులు కూడా హాజ‌ర‌య్యారు.

అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీలు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు లోకేష్ వివరించారు. ప్రెసిడెంట్ ను క‌లిసిన అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను రాజ‌ధాని పేరుతో మోసం చేసింద‌ని అన్నారు. కానీ ఎప్పుడైతే కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిందో ఇచ్చిన మాట నిల‌బెట్టు కోవ‌డం జ‌రిగింద‌న్నారు లోకేష్‌.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *