కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియ‌స్

ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలే

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా పాల‌న సాగిస్తున్న సర్కార్ ను కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్రయ‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. KTR తెలంగాణ రాష్ట్రంలో అవాస్తవ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. గ‌త తొమ్మిదేళ్ల BRS పాలనలోనే తెలంగాణకు, హైదరాబాద్‌కు అంతా జరిగిపోయినట్లుగా ఆయన మాట్లాడుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ , రాష్ట్రం రెండింటి అభివృద్ధిలోనూ కాంగ్రెస్ కీలకమైన, ప్రాథమిక పాత్ర పోషించిందని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌ని పేర్కొన్నారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్ రాష్ట్రానికి ఒక సానుకూల ఆలోచనా విధానాన్ని అందించిందని చెప్పారు ఎంపీ. BRS పాలనలో, వారు రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఈ పాల‌నా కాలంలో KCRకు ఒక అత్యంత విలాసవంతమైన ఫామ్‌హౌస్ సమకూరడమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. మీరు అధికారాన్ని కోల్పోయారు కాబట్టే మీకు నిద్ర కరువైందన్నారు ఎంపీ.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *