newsseals.com
News

ఆప‌రేష‌న్ స‌క్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెస్ట్

VijayaBhaskar April 18, 2026
newsseals-PawanKalyan
Spread the love

వెల్ల‌డించిన జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు.

వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించారు. ఈ మేర‌కు వెంట‌నే శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అభిమానులు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. పార్టీ కార్యాల‌యం ఏపీ డిప్యూటీ సీఎం ఆరోగ్య ప‌రిస్థితిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.