స్వ‌ర్ణాంధ్ర స్వ‌చ్ఛాంధ్రను విజ‌య‌వంతం చేయాలి

పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌ర్ణాంధ్ర స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం అని చెప్పారు. ‘జలధార-జలహారతి’ థీమ్‌తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించడం జ‌రిగింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

స్వచ్ఛాంధ్ర స్టాళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు సీఎం. మాలకోడు చెరువు పునరుద్ధరణ, కంపోస్టింగ్ విధానాలపై నిపుణులు, మహిళలతో చర్చించారు. చెత్త నుంచి సంపద తయారీతో స్వయం సహాయక సంఘాలు ఆదాయాన్ని పొందడం స్ఫూర్తి దాయకం అని ప్ర‌శంస‌లు కురిపించారు. స్థానికుల సమస్యలు, వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శాశ్వత పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *