పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

Spread the love

ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.
పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది స‌ర్కార్.

ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్న కాంటీన్లను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం . మొత్తంగా రాష్ట్రంలో 269 పెరిగిన అన్న క్యాంటీన్ల సంఖ్య. త్వరలో మరో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గడచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రతీ రోజూ ఒక్కో అన్న క్యాంటీన్ లో సగటున 1013 మందికి భోజన సదుపాయం క‌లిగింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం రూ.243 కోట్లు వెచ్చించింద‌న్నారు సీఎం.

  • Related Posts

    శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ…

    పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం

    Spread the love

    Spread the loveసీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *