కాల్పుల విరమ‌ణ ఒప్పందం పొడిగింపు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌శ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో త‌గ్గితే స‌రి లేక పోతే యుద్దం చేయాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అయినా ఇరాన్ ఒప్పుకోలేదు. మ‌రో వైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా వార్ ను ఆప‌బోమంటూ కౌంట‌ర్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా అమెరికా చీఫ్ సూచ‌న‌తో పాకిస్తాన్ దేశ ప్ర‌ధాని రంగంలోకి దిగారు. ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ త‌రుణంలో ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని బుధ‌వారం సామాజిక మాధ్యమాల్లో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలకు రాబోమని ఇరాన్ తెగేసి చెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా ప‌డింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *