చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆర్టీసీ కార్మికులు సంతోషం

Spread the love

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు ఘ‌న స‌న్మానం

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళ‌న దెబ్బ‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. వారు ముందు ఉంచిన 32 డిమాండ్లను ఒప్పుకుంది. గ‌త్యంత‌రం లేక క‌మిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నందుకు నిన్న అర్ధ‌రాత్రి నుంచే స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆర్టీసీ జేఏసీ నేత‌లు. ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న‌కు శాలువా క‌ప్పి స‌న్మానించారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేర్చడంతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం.. కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ ,ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు జేఏసీ నేత‌లు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ ,ఇతర సంఘాల నేతలు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తో ప్రజా రవాణా ను మరింత బలపరిచేలా ఉత్సాహం తో కార్మికులు పని చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన జ‌గ‌న్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు.వైసీపీ పాల‌నలో రైతుల‌ను ప‌ట్టించు కోలేద‌ని, వ్య‌వ‌సాయ రంగాన్ని భ్ర‌ష్టు ప‌టి్ంచార‌ని ఆరోపించారు.2019–2024 మధ్య…

    సీఎం చంద్ర‌బాబు ద‌మ్మున్న లీడ‌ర్ : స‌విత‌

    Spread the love

    Spread the loveఆయ‌న నాయ‌క‌త్వం స్పూర్తి దాయ‌కం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు ద‌మ్మున్న లీడ‌ర్ అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *