సంక్షేమ ప‌థ‌కాల్లో ఆడ‌బిడ్డ‌ల‌కు పెద్ద‌పీట‌

స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో ఆడబిడ్డల భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాబోదని నేను నమ్ముతాన‌ని అన్నారు. అందుకే నిర్ణయాల్లో, సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పారు సీఎం. మహిళలు – పిల్లల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా “స్పందన” పేరుతో టీంలను ఈ రోజు ICCC లో ప్రారంభించడం వారి భద్రత పట్ల మా బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు.

తెలంగాణలో డ్రగ్స్ ను ఎట్టి పరిస్థితులలోను నిర్మూలించాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు సీఎం. డ్రగ్స్ కేసుల ఈ విషయంలో ఎంత పెద్ద వారు ఉన్నా నేను కేర్ చేయన‌ని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజంతోనే మహిళ – పిల్లల భద్రతకు హామీ వస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలబెట్టడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సీతక్క, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *