newsseals.com
News

సీఎంను క‌లిసిన శివ‌ధ‌ర్ రెడ్డి, సీవీ ఆనంద్

VijayaBhaskar May 2, 2026
newsseals-DGP
Spread the love

అభినందించిన అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి , నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే బదిలీపై వివిధ పదవీ బాధ్యతలు చేపట్టిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఎ. రేవంత్ రెడ్డిని కలిసిన అధికారుల్లో శిఖా గోయల్ , డీఎస్ చౌహన్ , శ్రీ షానవాజ్ ఖాసీం , శ్రీ తరుణ్ జోషి , శ్రీమతి బి. సుమతి ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 30వ తేదీన డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆ వెంట‌నే రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా నియ‌మించిన స‌ర్కార్ ఉన్న‌ట్టుండి ఒక్క రోజు కూడా తేడా లేకుండానే త‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన శివ‌ధ‌ర్ రెడ్డికి ప్ర‌భుత్వ భ‌ద్ర‌త‌కు సంబంధించి స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఆ వెంట‌నే సీవీ ఆనంద్ కు డీజీపీగా ఛాన్స్ ఇచ్చారు.