ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

Spread the love

అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్

నంద్యాల జిల్లా : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి నిర్మాణం పూర్తి చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం సరైంది కాదని ధ్వ‌జ‌మెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలంటూ అంబటి తీవ్ర విమర్శలు చేశారు. ఈ జ‌న్మ‌లో సీఎం, మంత్రి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయ‌లేర‌న్నారు అంబ‌టి రాంబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. వారి నిర్వాకం వ‌ల్ల‌నే ఏపీ మ‌రో వందేళ్లు వెన‌క్కి వెళుతోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల పేరుతో పేద‌ల భూములు లాక్కుంటున్నార‌ని, ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అంబ‌టి రాంబాబు.

  • Related Posts

    చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎస్. స‌విత అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు…

    క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ అంబాసిడ‌ర్ , ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *