వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Spread the love

సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ

హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొద‌లు జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్యారోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

వ‌డ‌దెబ్బ‌తో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే త‌గిన వైద్య స‌హాయం అందించాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్నం ప్ర‌యాణాలు చేయ‌కుండా ఉండాల‌ని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ క‌లెక్ట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు సీఎస్ ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

  • Related Posts

    టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

    Spread the love

    Spread the loveమంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరిన సీఎం విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరింది న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలోని టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్బంగా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివ‌ర్గంలో చేరాల‌ని…

    పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి అధ‌వ అర్జున చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *