మీరే అన్నీ నిర్ణయిస్తే ఇక జడ్జి ఎందుకుని ఫైర్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు సాయి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పోలీసులు ఏం చెబితే తాము అదే చెబుతున్నామని అన్నారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేశాం. ఇంకేం చేయాలో మీరే నిర్ణయిస్తే ఎలా అని ప్రశ్నించారు. గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అప్పగిస్తే ఇంట్లోనో.. పోలీస్స్టేషన్లోనో అప్పగిస్తారు..రోడ్డు మధ్యలో కస్టడీలోకి తీసుకుంటే లొంగుబాటు అంటారా అని సీఎం ప్రశ్నించారు.
కేటీఆర్ జడ్జిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవోగా చేస్తున్నట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు చట్టాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదు రాగానే కేసు పెట్టామన్నారు సీఎం. కేటీఆర్ మనిషేనా అసలు.. అమ్మాయి ఫొటోలు బయటకు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ అమ్మాయిని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. ఇదేం శాడిజమో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ బావమరిది డ్రగ్స్తో దొరికితే నోటీసు ఇచ్చాం..బండి భగీరథ్కు కూడా నోటీసులు ఇచ్చామన్నారు.
అమ్మాయి వయస్సును ఎవరు నిర్ధారిస్తారు? కేటీఆర్ నిర్ధారిస్తారా అని నిప్పులు చెరిగారు.






