పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి న‌దిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇందు కోసం ఆయా ప‌రిశ్ర‌మ‌లు ఫోక‌స్ పెట్టాల‌న్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

.తగిన చొరవ తీసుకొని పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. పుష్కరాల విజయవంతానికి పరిశ్రమల నిర్వాహకుల చొరవ చాలా అవసరం అన్నారు. ప్రభుత్వానికి తగిన విధంగా సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం. ఈ సమావేశంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య , అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పారిశ్రామిక‌వేత్త‌లు సైతం ప‌లు సూచ‌న‌లు చేశారు డిప్యూటీ సీఎంకు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *