కాంగ్రెస్ హైక‌మాండ్ ను క‌లిస్తే త‌ప్పేంటి..?

ఐటీ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్

బెంగ‌ళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు అధిష్టానం ముఖ్యమంత్రి సిద్ద‌రామ‌య్య‌ని, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ ని పిలిచిందని అన్నారు. అంతే కాకుండా మరో 15-20 రోజుల్లోనే పలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయని చెప్పారు. కాబట్టి, వారు అధిష్టానంతో ఆ విషయాల గురించి కూడా చర్చిస్తారని తెలిపారు.

పార్టీ ప‌రంగా , ప్ర‌భుత్వ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ అగ్ర నేత‌లు స‌మాలోచ‌న‌లు చేస్తుంటార‌ని, ఇందులో ఎలాంటి త‌ప్పుందంటూ ప్ర‌శ్నించారు ప్రియాంక్ ఖ‌ర్గే. మా నాయకులు, శాసనసభ్యులు , మండలి సభ్యులు మా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్లడంలో తప్పేముంది అని ప్ర‌శ్నించారు. ఒకవేళ వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరేందుకు వెళ్ల లేదు క‌దా అంటూ సెటైర్ వేశారు ప్రియాంక్ ఖ‌ర్గే. అలా అయితే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంద‌న్నారు మంత్రి.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *