ఆయిల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో స‌ర్కార్ ఫెయిల్

మోదీ, చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, అదానీ, అంబానీల‌పై భ‌గ్గుమ‌న్నారు . దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆయిల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో ఘోరంగా వైఫల్యం చెందింద‌ని ఆరోపించారు. నాలుగవ సారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19 పైసలు ఉండ‌గా డీజిల్ లీటర్ ధర రూ. 104.88 పైసలు అమ్ముతుండ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంధనపు ధరలు అధికం గా ఉన్నాయ‌న్నారు.

రాష్ట్ర ప్రజలపై మోడీ సర్కార్ భరించారని భారం మోపుతుంటే బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడు మౌనంగా ఉండ‌డం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు ష‌ర్మిలా రెడ్డి. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేక పోవడం బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్లీ డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలోనైనా అధికంగా వసూలు చేస్తున్న రూ. 4 వ్యాట్ ను , రూ. 1 రోడ్ సెస్ ను రద్దు చేయాల‌ని పేర్కొన్నారు. ఇంధన ధరలపై కొంతమేరకు ఉపశమనాన్ని కల్పించాల‌ని కోరారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *