విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

అధికారుల‌ను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : ఏపీలో భారీ ఎత్తున వ‌డ‌గాల్పులతో పాటు అకాల వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియ‌డం, గాలి వాన‌ల బీభ‌త్సం సృష్టించ‌డంతో పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచి పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ విద్యుత్ పోల్స్ విరిగి పోగా మ‌రికొన్ని నేల రాలాయి. చెట్లు సైతం ఇబ్బంది క‌లిగించాయి. దీంతో విద్ఉత్ వైర్లు తెగి పోయాయి. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు కీల‌క సూచ‌న‌లు చేశారు.

ఈదురుగాలులతో చెట్లు, డిస్‌ప్లే హోర్డింగ్లు విద్యుత్ స్తంభాలపై పడినట్లు వివరించారు విద్యుత్ శాఖ అధికారులు .దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు గొట్టిపాటి ర‌వికుమార్. ఎక్కడికక్కడ లైన్లు క్లియర్ చేసుకుంటూ… విద్యుత్ పునరుద్ధరణ చేపడుతామన్నాని మంత్రికి తెలిపారు. అధికారులు . కాగా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు మంత్రి.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *