2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే ఉన్నారు. వీరు గ్యాప్ 1 ప్రాంతంలో ఏడు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు అన్ని నాణ్యతగా ఉన్నాయని తేలింది. ఈ పరీక్ష నిర్వహించటానికి ఏడు గంటల సమయం పడుతుంది.
ఇదే తరహా పరీక్షలు గ్యాప్ 2 లో ఈ బృందం నిర్వహించనుంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డి ఈ లు శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈమేరకు ఆయన పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు గాను కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.






