పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

Spread the love

2027 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ‌ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే ఉన్నారు. వీరు గ్యాప్ 1 ప్రాంతంలో ఏడు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు అన్ని నాణ్యతగా ఉన్నాయని తేలింది. ఈ పరీక్ష నిర్వహించటానికి ఏడు గంటల సమయం పడుతుంది.

ఇదే తరహా పరీక్షలు గ్యాప్ 2 లో ఈ బృందం నిర్వహించనుంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డి ఈ లు శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది 2027 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈమేర‌కు ఆయ‌న ప‌లుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లారు. నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. ఇందుకు గాను కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.

  • Related Posts

    ‘స‌ర్ ‘పై ఈసీ నిర్ణ‌యం సరైన‌దే : సుప్రీంకోర్టు

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు…

    ఢిల్లీకి బ‌య‌లు దేరిన సీఎం జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveప్ర‌ధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా దేశ రాజ‌ధానికి వెళ్ల‌డం. ఇప్ప‌టికే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *