తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు

Spread the love

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి చాటి చెప్పిన చారిత్రాత్మక వేదిక మహానాడు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారతకు అండగా నిలిచిందని, ఈసారి “స్త్రీశక్తి” నినాదంతో మహానాడు నిర్వహించడం గర్వ కారణమన్నారు. మహిళా శక్తి, యువశక్తి, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో మహానాడు-2026 కొత్త దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

మహిళల అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది అని పార్టీ ఎప్పటినుంచో నమ్ముతోందన్నారు . మహానాడు-2026 కేవలం పార్టీ సమావేశం కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదిక అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా నడిపించే సంకల్పానికి ఇది తొలి మెట్టు అవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు . రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పెట్టుబడులు తీసుకు రావడం, పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం మహానాడు ప్రధాన ధ్యేయాల్లో ఒకటన్నారు కింజార‌పు అచ్చెన్నాయుడు.

  • Related Posts

    ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇంటికి పోలీసులు వెళ్ల‌లేదు

    Spread the love

    Spread the loveఅదంతా అబ‌ద్ద‌మ‌ని ఖండించిన మంత్రి అనిత అమ‌రావ‌తి : తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఓ వైపు బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు సంచ‌ల‌నంగా మారితే…

    రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

    Spread the love

    Spread the loveనిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *