ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

Spread the love

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఆయ‌న జ‌న‌సేన పార్టీ గురించి, ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. చివ‌ర‌కు ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వ‌ర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన పోలీసులు తెలంగాణ‌కు రానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లుగుతుంద‌ని ఖాకీల‌ను నాగేశ్వ‌ర్ రావు ఇంటి ముందు మోహ‌రించారు.

దీనిపై స్పందించారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌పై ఆన్ లైన్ వేదిక‌గా ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు స్వ‌యంగా డీజీపీ సీవీ ఆనంద్ ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు అంశంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని, త‌న‌ను అరెస్ట్ చేయాలంటూ వ‌స్తున్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, తాను ఎలా చెబుతానంటూ తిరిగి ప్ర‌శ్నించారు. అది జ‌రిగి పోయిన వ్య‌వ‌హారం, ఇక వ‌దిలి వేయాల‌ని కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

  • Related Posts

    ‘స‌ర్ ‘పై ఈసీ నిర్ణ‌యం సరైన‌దే : సుప్రీంకోర్టు

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు…

    ఢిల్లీకి బ‌య‌లు దేరిన సీఎం జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveప్ర‌ధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా దేశ రాజ‌ధానికి వెళ్ల‌డం. ఇప్ప‌టికే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *