ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఆయ‌న జ‌న‌సేన పార్టీ గురించి, ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. చివ‌ర‌కు ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వ‌ర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన పోలీసులు తెలంగాణ‌కు రానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లుగుతుంద‌ని ఖాకీల‌ను నాగేశ్వ‌ర్ రావు ఇంటి ముందు మోహ‌రించారు.

దీనిపై స్పందించారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌పై ఆన్ లైన్ వేదిక‌గా ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు స్వ‌యంగా డీజీపీ సీవీ ఆనంద్ ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు అంశంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని, త‌న‌ను అరెస్ట్ చేయాలంటూ వ‌స్తున్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, తాను ఎలా చెబుతానంటూ తిరిగి ప్ర‌శ్నించారు. అది జ‌రిగి పోయిన వ్య‌వ‌హారం, ఇక వ‌దిలి వేయాల‌ని కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *