చంద్ర‌బాబు భ‌జ‌న చేసిన బ‌క్క‌ని న‌ర‌సింహులు

తెలంగాణ అనే ప‌దం డిక్ష‌న‌రీలో లేద‌ని కామెంట్

మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీ మ‌హానాడు వేదిక‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన షాద్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు బ‌క్క‌ని న‌ర‌సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడినంత సేపు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును పొగ‌టానికే స‌రి పోయింది. ఇక తాను ఏం చేస్తున్నాన‌నే విష‌యం చెప్ప‌లేక పోయారు. అంతే కాదు అస్తిత్వానికి, పోరాటాల‌కు పురిటి గ‌డ్డ అయిన తెలంగాణ గురించి అవాకులు పేలారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదన్నారు కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కష్టపడే వాళ్ల జీవితాలలో మ‌న్ను పోశారంటూ వాపోయారు.

తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను నందమూరి తారక రామారావు రద్దు చేశాకే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింద‌న్నారు.భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ప్రజల సంక్షేమ కోసం అన్ని వసతులను ప్రజల గుమ్మం దగ్గరకే తీసుకొచ్చారన్నారు .చదువుల పండుగ అనే పథకం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యనందించిన ఘనత చంద్రబాబుది అనిపేర్కొన్నారు. తాత, తండ్రి అడుగుజాడల్లో యువ నాయకుడు లోకేష్ చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయ‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *