అర్జున్ దాస్ కు మఠాధిపతి గా కొనసాగింపు
తిరుపతి : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠం కేసు ఇవాళ విచారణకు వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్జున్దాస్పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్దాస్కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్నట్లు స్పష్టం చేసింది.
రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది హతీరాంజీ మఠం కేసు. మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించి ఏపీ కూటమి సర్కార్.మఠం ఆస్తుల జాబితా తయారు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం. మరో వైపు ఏడాది లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.







