బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు

హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా విజయశేఖర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రామకృష్ణ వార్తలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కె.నారాయణ మూర్తి, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు, కొల్లి అరవింద్, వేణుగోపాల్, రాధాకృష్ణ, ఎం.సాగర్ కుమార్, బి.రాములు, ప్రముఖ సామాజిక నేత, అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపక కార్యదర్శి జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాజ్, కె.ఎన్.ఆర్ మహర్షి, శ్రీ జాగర్లమూడి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు మరిశెట్టి మురళీ కుమార్ లతో పాటు అనేక మంది జర్నలిస్టులు పాల్గొని జాగర్లమూడి రామకృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *