ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉంది : విరాట్ కోహ్లీ

Spread the love

ఇప్ప‌టికే ఆర్సీబీ రెండు సార్లు విజేత‌గా నిలిచింది

అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ విజేత‌గా నిలిచింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది ఆర్సీబీ. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గుజ‌రాత్ ను కేవ‌లం 155 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసింది. ప్ర‌ధానంగా ఆర్సీబీ బౌలర్లు స‌లామ్ ధార్ 3 వికెట్లు తీస్తే , భువ‌నేశ్వ‌ర్ కుమార్ 2, హేజిల్ వుడ్ 2 వికెట్లు తీశారు. గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించారు.

అనంత‌రం బ‌రిలోకి దిగింది ఆర్సీబీ. 18 ఓవ‌ర్ల‌లోనే 156 ర‌న్స్ చేసి విజేత‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా 18 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది 2025లో ఆర్సీబీ ర‌జ‌త్ పాటిదార్ నాయ‌త‌క్వంలోని ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. తాజాగా ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ 19 సీజ‌న్ లో సైతం స‌త్తా చాటింది. 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 75 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ అనంత‌రం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. వ‌రుస‌గా రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను గెలుచుకున్నాం. రాబోయే వ‌చ్చే ఏడాది 2027లో కూడా క‌ప్పుగెల‌వాల‌ని ఉంది. హ్యాట్రిక్ సాధిస్తామ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు కోహ్లీ.

  • Related Posts

    శుభ్‌మన్ గిల్ పై భ‌గ్గుమ‌న్న వీరేంద్ర సెహ్వాగ్

    Spread the love

    Spread the loveబాధ్య‌తా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్‌లో, అది కూడా ఒక ఫైనల్‌లో, శుభ్‌మన్ గిల్ నుండి మీరు…

    గుజ‌రాత్ టైటాన్స్ ఓట‌మిపై కోచ్ నెహ్రా సీరియ‌స్

    Spread the love

    Spread the loveఅగ్ర‌శ్రేణి బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కొంప ముంచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవ‌సం చేసుకుంది ర‌జ‌త్ పాటిదార్ సారథ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు (ఆర్సీబీ). తొలుత బ్యాటింగ్ చేసిన ప్ర‌త్య‌ర్థి గుజ‌రాత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *