ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఈ త‌రుణంలో పోలీసులు కేసు నమోదు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ సంద‌ర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల మండిప‌డ్డారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

పవన్ కళ్యాణ్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని, ఇక్కడ తన నటనను ప్రారంభించారని ఆరోపించారు. ఒకవేళ ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యుంటే, అక్కడ ఆయనకు నచ్చినట్లుగా వ్యవహరించ గలిగేవారని అన్నారు. కానీ తెలంగాణలో తాను ఏమైనా చేస్తానంటే, దాన్ని సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణపై విషం చిమ్మే పవన్ కళ్యాణ్, ‘నవ నిర్మాణ’ పేరిట ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *