పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Spread the love

ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్ర‌క‌ట‌న

తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనునట్లు ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన దలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మొబైల్ నంబరు: 8977779471కు కాల్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ సమస్యపై చర్చించి, పరిష్కరించు కునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును సంబంధిత వినియోగదారులకు పంపడం జరిగిందని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రాజధాని నిర్మాణం చేతకాకే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు…

    చెట్టినాడు సిమెంట్స్ ప‌న్నుల ఎగ‌వేత

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లు వెద‌జ‌ల్లుతున్న కాలుష్యంపై మండిప‌డ్డారు. మ‌రో వైపు ఆయా గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని కంపెనీలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *