రాజధాని నిర్మాణం చేతకాకే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్

నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని ప్రజలను డైవర్ట్ చేయటానికి మహానాడులో తెలంగాణ వ్యక్తితోనే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అనిపించారని విమర్శించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు అలా మాట్లాడడని చెప్పారు. ఇవన్నీ యాధృచ్చికంగా కాకుండా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలని కవిత చెప్పారు. రాజ్యాంగం తమకు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. మీ డిక్షనరీ లో తెలంగాణ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఫైర్ అయ్యారు.

వానకాలం వచ్చిందంటే సెక్రటేరియేట్ లోకి నీళ్లు, రాజధాని మునిగిపోవటం అనేది ఆంధ్రా ప్రజలకు అవమానమని కవిత అన్నారు. నాయకులకు ఏదైనా అయితే వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారని…కానీ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. నెల్లూరు వాళ్లు చెన్నైయ్ కి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు రావాల్సిందేనా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం 80 వేల ఎకరాలు సేకరిస్తున్నారని…అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. పాలన సౌలభ్యం కోసం కొన్ని భవనాలు నిర్మించేందుకు 80 వేల ఎకరాలు ఎందుకన్నారు. ఈ విషయంలో అవసరమైతే ఆంధ్రా ప్రజల హక్కుల కోసం పోరాడుతామని కవిత చెప్పారు.

Related Posts

స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *