పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

Spread the love

స్ప‌ష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి

విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ , కరవును తట్టుకునే శక్తిని పెంపొందించడం” అనే ముఖ్యమైన ఆశయంతో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడు కోవడమేన‌ని అన్నారు ఐజీ. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం. మారుతున్న కాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని అన్నారు. సహజ వనరులను వృధా చేయకుండా గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా చూడాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి వృక్షాలుగా మార్చాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది , ప్రజలు అందరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఐజీ ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక హితాన్ని కోరి రేంజ్ పరిధిలో ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

  • Related Posts

    విశాఖ‌లో సైకిల్ తొక్కిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

    Spread the love

    Spread the loveఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వ‌ర‌కు సైకిల్ యాత్ర విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. శుక్ర‌వారం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా…

    జీతాలు అంద‌క అంగన్‌వాడీ టీచర్ల ఇక్క‌ట్లు

    Spread the love

    Spread the loveప్ర‌తి నెలా ఒక‌టో తేదీన ఇస్తామ‌న్న స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డంలో విఫ‌లం అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన అంద‌రికీ వేత‌నాలు వారి వారి ఖాతాల‌లో జ‌మ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *