బొద్దింక‌ల జ‌నతా పార్టీ నిర‌స‌న కేంద్రంపై ఆందోళ‌న

సీజేపీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సార‌థ్యంలోని బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ) శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జాస్వామిక వాదులు, స్వ‌చ్చంద సేవ‌కులు, పౌర స‌మాజం, పౌర హ‌క్కుల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇందులో స్వ‌చ్చంధంగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సీజేపీ నేత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు , ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏం సాధిస్తారని ప్రజలు అడుగుతుంటారని అన్నారు. అవి మనం సజీవంగా ఉన్నామని నిరూపిస్తాయని పేర్కొన్నారు . ప్రభుత్వ దృష్టిలో మనం కేవలం పురుగులమంత అల్పమైన వారమే కావచ్చు, కానీ మనం ఇంకా ఉనికి కోల్పోలేద‌ని సజీవంగా ఉన్నాం అని తెలియ చేస్తుంద‌న్నారు. అంతే కాదు మన హక్కుల కోసం పోరాడగల సామర్థ్యం మనకు ఉంద‌ని ప్ర‌క‌టించేందుకు ఇది వీలు క‌ల్పిస్తుంద‌న్నారు సీజేపీ చీఫ్‌.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *