హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

బీసీసీఐ సెలెక్టర్లపై రమేష్ ఘాటు కామెంట్స్

చెన్నై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ టి20 జ‌ట్టు తాజా ఎంపిక‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు మాజీ క్రికెట‌ర్ శ‌ట‌గోప‌న్ ర‌మేష్. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరిగారు. ఏ ప్రాతిప‌దిక‌న ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారో చెప్పాల‌న్నాడు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు జ‌ట్టులో తీసుకున్న హ‌ర్షిత్ రాణా గురించి. త‌న‌ను ఎలా ఎంపిక చేశారని, ఏ ప్రాతిప‌దిక‌న సెలెక్టు చేశారో చెప్పి తీరాలన్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను దేశవాళీ క్రికెట్ ఆడాడని నాకు అనిపించడం లేదన్నాడు.

దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు షమీ లేదా మిగిలిన వారి మనసులో ఏముంటుందో ఒక్కసారి ఊహించు కోవాల‌ని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ అయినా లేదా రోహిత్ శర్మ అయినా సరే, ఎంపిక పరిశీలనలో ఉండాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పింది. హార్దిక్ పాండ్యా గాయపడినప్పుడు కూడా, ఎంపిక కోసం అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వచ్చింది. షమీ విషయంలో అయితే, గాయం తర్వాత అతను ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలడా అని ప్రశ్నించారు .

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *