త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

Spread the love

ఒత్తిడికి గురి చేయ‌డం మంచిది కాదు
కోల్ క‌తా : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్య‌క్షుడు, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన ఐపీఎల్ 19 హీరో , బీహార్ కు చెందిన చిచ్చ‌ర పిడుగు , యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పై స్పందించాడు గంగూళీ. ఇవాళ ఆయ‌న కోల్ క‌తా వేదిక‌గా మీడియాతో మాట్లాడాడు. త‌న గురించి ఎక్కువ‌గా ఆలోచించేలా చేయకూడ‌దు. వైభ‌వ్ సూర్య వంశీని ఎప్ప‌టి లాగే, త‌ను ఆడుతున్న‌ట్లుగానే ఆడితే బెట‌ర్ అని సూచించాడు.

అతనికిప్పుడు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఒత్తిడి గురించి అతను పెద్దగా ఆలోచిస్తాడని నేను అనుకోవ‌డం లేద‌న్నాడు సౌర‌వ్ గంగూలీ. ఐపీఎల్‌లో అతను ఆడటం మనం చూశాం, కానీ భారత్ తరఫున ఆడటంలోని ఒత్తిడి వేరుగా ఉంటుందని అన్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫార్మాట్ లో చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని పేర్కొన్నాడు. ఆట ప‌రంగా వేగంతో పాటు ఎలా బంతుల‌ను ఎదుర్కోవాల‌నే దానిపై కూడా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు గంగూలీ. ఇదిలా ఉండ‌గా తాజాగా గంగూలీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

    Spread the love

    Spread the loveబీసీసీఐ సెలెక్టర్లపై రమేష్ ఘాటు కామెంట్స్ చెన్నై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ టి20 జ‌ట్టు తాజా ఎంపిక‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు…

    భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveశాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *