త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

ఒత్తిడికి గురి చేయ‌డం మంచిది కాదు
కోల్ క‌తా : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్య‌క్షుడు, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన ఐపీఎల్ 19 హీరో , బీహార్ కు చెందిన చిచ్చ‌ర పిడుగు , యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పై స్పందించాడు గంగూళీ. ఇవాళ ఆయ‌న కోల్ క‌తా వేదిక‌గా మీడియాతో మాట్లాడాడు. త‌న గురించి ఎక్కువ‌గా ఆలోచించేలా చేయకూడ‌దు. వైభ‌వ్ సూర్య వంశీని ఎప్ప‌టి లాగే, త‌ను ఆడుతున్న‌ట్లుగానే ఆడితే బెట‌ర్ అని సూచించాడు.

అతనికిప్పుడు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఒత్తిడి గురించి అతను పెద్దగా ఆలోచిస్తాడని నేను అనుకోవ‌డం లేద‌న్నాడు సౌర‌వ్ గంగూలీ. ఐపీఎల్‌లో అతను ఆడటం మనం చూశాం, కానీ భారత్ తరఫున ఆడటంలోని ఒత్తిడి వేరుగా ఉంటుందని అన్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫార్మాట్ లో చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని పేర్కొన్నాడు. ఆట ప‌రంగా వేగంతో పాటు ఎలా బంతుల‌ను ఎదుర్కోవాల‌నే దానిపై కూడా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు గంగూలీ. ఇదిలా ఉండ‌గా తాజాగా గంగూలీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *