రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

Spread the love

10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

11వ తేదీ గురువారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఎం కార్యక్రమానికి హాజ‌ర‌వుతారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు ఈ కీల‌క నీతి ఆయోగ్ స‌మావేశంలో. ఇందుకు సంబఃధించి పూర్తి నోట్స్ ను కూడా ఆయ‌న ప్రిపేర్ చేసుకుంటున్నారు.

  • Related Posts

    విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    Spread the love

    Spread the loveక్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద…

    పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్టాఫ్ ఆఫీస‌ర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియ‌మితులైన సీవీ ఆనంద్ కీల‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *