ముంబై ఇండియ‌న్స్ తోనే సూర్య కుమార్ యాద‌వ్

స్ప‌ష్టం చేసిన ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం

ముంబై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న తో తీవ్ర నిరాశ ప‌రిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఆశించిన మేర ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌లేక చ‌తికిల ప‌డింది. గ‌తంలో ప‌లుమార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది ముంబై ఇండియ‌న్స్. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు మాజీ స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ల పూర్ ప‌ర్ ఫార్మెన్స్ కార‌ణంగా వేటు వేయ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా కీల‌క అప్ డేట్ వచ్చింది. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు పాండ్యా, సూర్య‌ల పై బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ వేటు వేసింది. ఈ ఇద్ద‌రిని త‌ప్పించింది తాజాగా టి20 సీరీస్ కోసం.

ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం సుదీర్ఘంగా సూర్య కుమార్ యాద‌వ్ తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. త‌న‌ను జట్టుతోనే ఉండేలా ఒప్పించడంలో స‌క్సెస్ అయ్యింది. ఈ చర్చలు ఫ్రాంచైజీలో అతని దీర్ఘకాలిక పాత్ర, నాయకత్వ బాధ్యతలు, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్రీకృతమయ్యాయి. ప్రస్తుతానికి, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. దీంతో అతని భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడిందని భావిస్తున్నారు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *