కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం బాధాక‌రం

సూర్య కుమార్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్

ముంబై : భార‌త క్రికెట్ టి20 జ‌ట్టు మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను జాతీయ మీడియా పీటీఐతో మాట్లాడారు స్కై. భారత జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించబడటంపై బాధ‌ను వ్య‌క్తం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా, మిమ్మల్ని T20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై మీకు ఏమైనా నిరాశ లేదా అసహనం ఉందా అన్న ప్ర‌శ్నకు స‌మాధ‌నం ఇచ్చారు. నిజం చెప్పాలంటే, ఇది కాస్త బాధ కలిగించింది. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు నేను ఒక్క సిరీస్ లేదా టోర్నమెంట్‌లోనూ ఓడి పోలేద‌న్నారు.

కానీ ఒక ఆటగాడిగా అన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు అన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. ఏం జరిగినా అంగీకరించక తప్పదన్నాడు. నా రాతలో ఏముందో అదే నాకు లభించిందని తెలిపారు. ఇప్పుడు నేను దీని నుంచి బయటపడి, రాబోయే రోజుల్లో ఆడే వారికి మద్దతు ఇవ్వడం , సహాయ పడటంపై దృష్టి పెట్టాలన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా అనిపించింది అని వాపోయాడు సూర్య కుమార్ యాద‌వ్. అయినప్పటికీ, ఇప్పుడు నేను దీనిని వదిలేసి నా క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *