ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయన్న టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం కొనసాగుతోంది. ప్రతి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు. ఇందుకు గాను దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదాన్ని అందించింది. ఇది టీటీడీ ఆలయ చరిత్రలోనే ఓ రికార్డ్ కావడం విశేషం. అన్న ప్రసాదం కోసం టీటీడీ ప్రత్యేకంగా ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది.
భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.







