స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

Spread the love

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించ‌చారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాలేద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌ ఆటలో 48 మంది, ఖోఖోలో 49 మంది., జూడోలో 39 మంది, సాఫ్ట్‌బాల్‌లో 38 మంది, ఫెన్సింగ్‌లో 13 మంది ఉద్యోగాలు వచ్చాయ‌న్నారు.

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ , జూడో అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ ఎంపీ భరత్ ఉన్నార‌ని ఈ పోస్టుల కేటాయింపుల అక్రమాల‌లో వీరి ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్ సాధించిన క్రీడాకారుడికి మాత్రం ఉద్యోగం రాలేద‌ని దీనిపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ పోస్టుల‌ను ఎంత మొత్తానికి అమ్ముకున్నారో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పాల‌న్నారు.

  • Related Posts

    తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో…

    ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

    Spread the love

    Spread the loveహ‌వాలా, మ‌నీ లాండ‌రింగ్ ద్వారా నిధులు హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేప‌ట్టింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *