ఏ పార్టీతో పెట్టుకోం స్వ‌తంత్రంగా పోటీ చేస్తాం

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి షా

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని ప్ర‌క‌టించారు. మొదటగా, తెలంగాణ, పంజాబ్‌లలో కూడా ఇదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. మేము దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించామని అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఒకవేళ పొత్తు కుదరక పోతే ఇప్పటికి ఏపీలో గానీ, తెలంగాణలో గానీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. ఏపీలో కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే, టీడీపీ, జనసేనలకు కష్టాలు తప్పవు. అంతే కాకుండా, ముఖ్యంగా జనసేన పరిస్థితి దారుణంగా ఉంటుంది (ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చాలాసార్లు చెప్పారన్నది గమనార్హం). ఇదిలా ఉండ‌గా తాజాగా అమిత్ షా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు…

    తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *