షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్

Spread the love

నోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియ‌స్ అయ్యింది. త‌న‌కు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడు పోతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు షబ్బీర్ అలీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి భార్య . ఆయ‌న‌పై ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు.

మహిళలను కించపరిచేలా ఆరోపణలు చేసిన అంశంపై కాంగ్రెస్ పెద్దలు సీరియ‌స్ అయ్యారు. అయితే ఈ విషయంలో షబ్బీర్ అలీ కూడా గట్టిగానే ఉన్నట్లు స‌మాచారం. ష‌బ్బీర్ అలీ ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. త‌నకంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ కూడా ఉంది. అంతే కాదు గ‌తంలో తాను ప‌లు కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు. పార్టీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గ్రూప్ కూడా ఉంది. ఈ స‌మ‌యంలో ష‌బ్బీర్ అలీ చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    భాష‌ల‌పై ప‌ట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా

    Spread the love

    Spread the loveఎంపీ మ‌హూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా…

    జి7 స‌ద‌స్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ

    Spread the love

    Spread the loveస్లోవేకియా లో కూడా ప‌ర్య‌టించ‌నున్న పీఎం న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జీ 7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఫ్రాన్స్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *