ముదిరాజుల‌కు అన్యాయంపై ప్ర‌శ్నించాలి

VijayaBhaskar · June 13, 2026
Spread the love

మంత్రి వాకిటి శ్రీ‌హ‌రికి బీసీ – ఎ గ్రూప్ కులాలు

హైద‌రాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పై బిసీ – ఎ గ్రూపున‌కు చెందిన నేత‌లు మండి ప‌డుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్ అంశం ప్ర‌స్తావించ‌క పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాష్ట్ర యావత్తు ప్రజానీకం ప్రయోజనాల కోసం పని చేయడం ఆయన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా.. సిఎం లేని సమయంలో బిసి కమిషన్ నుంచి పిలుపు లేకుండా.. ఏకపక్ష నిర్ణయంతో కమిషన్ ముందు హాజరు కావడం ధిక్కర స్వరంగా బీసీ – ఏ గ్రూపులోఉన్న కులాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.

తన ముదిరాజ్ కులం ప్రతినిధులతో కలిసి బిసి కమిషన్ ముందుకు వెళ్లి కూర్చొని సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ప్రాధేయ పడడం అనైతికం త‌ప్ప మ‌రోటి కాద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర జ‌నాభాలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ముదిరాజుల సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతుంటే ప్ర‌శ్నించ‌క పోవ‌డం, నిల‌దీయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ద‌మ‌ని మండిప‌డ్డారు. ముదిరాజుల గురించి ప‌ట్టించుకోని వాకిటి శ్రీ‌హ‌రిపై రేవంత్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.