మీనాక్షి విష‌యంలో హైక‌మాండ్ సీరియ‌స్

ఎవ‌రు లీకు చేశార‌నే దానిపై విచార‌ణ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డి నుంచి ఆమెకు సంబంధించిన కేసు ఫైల్ ఎలా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎలా చేరింద‌ని, ఎవ‌రు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందేలా చేశారో తేలాల్సి ఉంద‌ని సీరియ‌స్ గా ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. ఓ టీవీ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీకి సమాచారం లీక్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. తనను కూడా ఇదే విష‌యం గురించి అధిష్టానం పెద్దలు కూడా విచారించారని తెలిపారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వం మీ చేతుల్లోనే ఉంద‌ని, దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు. సీఎం ఆధ్వ‌ర్యంలోనే హోం శాఖ ఉండ‌డం గ‌మనార్హం.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *