సీఎం విజ‌య్ తో సిలాంబ‌ర‌స‌న్ భేటీ

VijayaBhaskar · June 16, 2026
Spread the love

సినీ, రాజ‌కీయ రంగ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

చెన్నై : త‌మిళ సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు , సాంకేతిక నిపుణులు అగ్ర న‌టుడు, సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో భేటీ అయ్యేందుకు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే న‌టీమ‌ణులు త‌న‌ను క‌లిసి అభినందించారు. ముఖ్యంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు , ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ సుంద‌ర్ ప‌లుమార్లు విజ‌య్ ను క‌లిసారు. త‌న‌కు అత్యంత ఆత్మీయుడైన వ్య‌క్తి, స‌హ‌చ‌రుడంటూ పేర్కొన్నారు. గ‌తంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు.

ఇక మ‌రో అగ్ర వ‌ర్ద‌మాన న‌టి సిమ్రాన్ సైతం త‌న కుటుంబంతో క‌లిసి సీఎం విజ‌య్ తోను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకుంది. త‌న‌తో తాను క‌లిసి న‌టించిన సినిమాల‌ను గుర్తు చేసుకుంది. తాజాగా స్టార్ హీరో గా గుర్తింపు పొందిన సిలాంబ‌ర‌స‌న్ సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. త‌న‌ను క‌ల‌వ‌డం చెప్ప‌లేని సంతోషంగా ఉంద‌న్నాడు. త‌న‌కు సోద‌రుడు లాంటి వాడ‌ని విజ‌య్ ని ప్ర‌శంసించాడు. తమిళనాడు ప్రజలకు సేవ చేస్తున్న ఆయనకు శక్తి, విజయం, దేవుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు సిలాంబ‌ర‌స‌న్.