ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

Spread the love

అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం

స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డంలో, ఆయా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాల‌ను నెర‌ప‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. యుద్దాన్ని నిర‌సించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫ్రాన్స్ లో జ‌రిగిన జి7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. అనంత‌రం స్లోవేకియా దేశంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశం అత్యున్న‌త పౌర పుర‌స్కారం మోదీకి ల‌భించింది.

“ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” తో మోడీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకుని రికార్డు సృష్టించారు ప్రధాని మోదీ. ఈసంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని ప్ర‌క‌టించారు. భారత్, స్లోవేకియా సుదీర్ఘ స్నేహ బంధానికి ఈ పురస్కారం అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు. పదవి చేపట్టిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. పీఎం హోదాలో ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

    Spread the love

    Spread the loveవిద్యార్థుల‌కు సుంద‌ర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న , ప్ర‌వాస భార‌తీయుడైన , చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆస‌క్తిక‌ర…

    డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

    Spread the love

    Spread the loveఅభినందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *